ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతికాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు విస్త‌రించి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. ఈ ర‌క్క‌సికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే ఇలా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ కొంద‌రు కామాంధులు ఆగ‌డాలు ఆగ‌డం లేదు. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

 

మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన ఇలాంటి మాన‌వ మృగాల‌కు బ‌లైపోయిన ఓ మ‌హిళ ద‌ర్శ‌న‌మిస్తుంది. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. తాజాగా ఈ యువ‌తిని.. న‌మ్మిన‌ స్నేహితులే దారుణంగా మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేశారు. 

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అస్సాంలో ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న యువతిని న‌లుగురు స్నేహితులు కాదు కాదు.. న‌లుగురు కామాంధులు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆపై ఆమెకు మత్తుమందు ఇచ్చి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే విడిచిపెట్టి ప‌రార్ అయ్యారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు అపస్మారక స్థితిలో ప‌డి ఉన్న యువ‌తి చూసి వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆనంత‌రం స‌ద‌రు యువ‌తి అందించిన స‌మాచారం మేర‌కు కేసులు న‌మోదు చేసి.. ఇద్ద‌రు నిందితుల‌కు పోలీసులు ప‌ట్టుకున్నారు. మ‌రో ఇద్ద‌రు కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: