ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారినపడి దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక బాధిత దేశాలు సతమతవుతున్నాయి. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఈ రక్కసితో అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలను బయటకు రాకుండా.. పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లేడిపిల్లలా దొరికిన ఆడపిల్లల పట్ల రాక్షసుల్లా మారి ప్రాణాలు హరిస్తున్నారు. ఇక వీరిని పదునైనా చట్టాలు కూడా ఏమి చెయ్యలేక పోవడం గమనార్హం. ఎన్కౌంటర్లలో కాల్చి చంపినా భయంలేకుండా పోతోంది. మళ్లీ మళ్లీ చట్టాలు తెచ్చినా మట్టితో సమానమంటున్నారు. రోజురోజుకు కామ మధం మత్తులో కామోన్మాదులుగా చెలరేగి పోతూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ నీచుడు దొంగతనానికి వెళ్లి.. ఒంటరిగా నిద్రిస్తున్న యువతిపై దారుణంగా అత్యాచారం చేశాడు.
పూర్తి వివరాళ్లోకి వెళ్తే.. బీహార్ లోని మధుబని ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి అదే ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె ఎన్ని కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితురాలి వేదన అరణ్య రోదన అయ్యింది. లైంగిక దాడి తర్వాత అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అయితే కాసేపటికి తేరుకున్న సదరు యువతి ఫోన్ ద్వారా చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో.. వెంటనే వారంతా పరుగున వచ్చారు. దారుణ స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.. పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.