నేటి స‌మాజంలో అక్ర‌మ సంబంధాలు రోజురోజుకూ విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి. ఒకప్పుడు స్త్రీలు భారతీయ సంప్రదాయాలను, కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటించేవారు. ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి మన దేశానికి పాకిందో.. అప్ప‌టి నుంచీ స్త్రీలు కూడా తమ కట్టుబాటులను మార్చుకుంటూ దారుణంగా ప్ర‌వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో  చాలా మంది మ‌హిళ‌లు పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. కానీ, ఆ అక్ర‌మసంబంధాలే కుటుంబాల‌ను చిన్నా భిన్నం చేస్తున్నాయి.

 

వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడా వీపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు, వివాహ బంధాన్ని, రక్త సంబంధాలను సైతం లెక్కచేయకుండా కొన్ని నిమిషాల సుఖం కోసం ప‌క్క‌దారులు ప‌డుతున్నారు. తాజాగా భార్యతో అక్రమ సంబంధాన్ని వదులుకోమని కోరిన భర్తను దారుణంగా హత్య చేసి ప‌రార్ అవ్వాల‌నుకుంది ఓ యువ‌తి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  జార్ఖండ్ లోని జంషెడ్ పూర్‌లో కుమార్ అనే వ్య‌క్తి తన భార్య ల‌క్ష్మీతో నివాసం ఉంటున్నారు. కుమార్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ల‌క్ష్మీ స్థానిక యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సంబంధం నడుపుతోంది. 

 

ఈ విషయం తెలుసుకున్న కుమార్‌..  పిల్లలు యుక్త వయస్సుకు వచ్చారని, వారి ముందే వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏంటని మందలించడంతో కోపంతో ఊగిపోయిన భార్య.. క‌ట్టుకున్న భ‌ర్త‌నే హ‌త‌మార్చాల‌ని ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలోనే గతవారం రాత్రి ఆమె.. తినే ఆహారంలో విష‌యం క‌లిపింది. అది అతడు తినగానే అక్కడి నుంచి ప్రియుడితో కలిసి ప‌రార్ అయింది. ఇక‌ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఇక డాక్టర్ల చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు కుమార్‌. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: