నేటి స‌మాజంలో ఆడ‌పిల్లకు ర‌క్ష‌ణ.. గాల్లో దీపంలా మారింది. ఆడ‌పిల్ల‌ను అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకం లోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్నాం. పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న మ‌న‌లో ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే . ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని మ‌హాత్మ అన్నారు. కానీ ఇప్పటి కాలంలో ఆడపిల్ల అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా ఒంటరిగా రోడ్డుపైన నడవలేని దుస్థితి ఏర్ప‌డింది. రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

 

కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు కామాంధులు ఆడ‌ది క‌నిపిస్తే.. చాలు అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. సమాజంలో వావి వరుసలు, వయస్సుతో తేడా లేకుండా పసిబిడ్డ నుంచి కాటికి కాలు జాపే పండు ముస‌లి అని కూడా చూడ‌కుండా అత్యాచారాలు చేస్తున్నారు. అమ్మ కడుపులో ఉండగానే పుట్టేహక్కును కోల్పోతోంది. పుట్టినా జీవించే హక్కును కోల్పోతోంది. కానీ, నేరం చేసిన కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావ‌డం లేదు. ఇక తాజాగా పెళ్లి చేసుకుంటాన‌ని ఓ మైన‌ర్ బాలిక‌ను న‌మ్మించి మోసం చేశాడు ఓ వ్య‌క్తి.

 

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బాలిక అమాయ‌క‌త్వాన్ని ఆసరాగా చేసుకుని అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సత్యనారాయణపురంనకు చెందిన మైనర్ బాలిక(16)ను ఖుద్దుస్ నగర్‌కు చెందిన హుస్సేన్(33) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలోనే సదరు మైనర్‌పై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు పోలీసులు  పొక్సో యాక్టు, అత్యాచారం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అలాగే ప్ర‌స్తుతం నిదింతుడు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: