నేటి సమాజంలో ఆడవారికి ఇంటా బయట కూడా రక్షణ లేకుండా పోతోంది. మహిళలను ఆకాశంలో సగం.. సమాజంలో సగం అంటూ అనేక మాటలు చెప్పినా బాలికలు, మహిళలు శారీరకంగా, మానసికంగా నిరంతరం వేధింపులకు గురవుతున్నారన్నారు. కామోద్రేకంతో ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక రక్షణ కల్పించాల్సిన పోలీసులు పక్కనే ఉన్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం మహిళాలోకానికి కానరావడం లేదు. మహిళలను దైవంగా కొలిచే మన దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు పోలీసులున్నారు. మరోవైపు చట్టాలున్నాయి. కానీ ఆడవారిపై జరుగుతున్న నేరాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా పెళ్లై ఇంటికి వచ్చిన కోడలు కన్నా కాదా అని తెలుసుకోవడానికి.. ఆమెపై మామ దారుణంగా అత్యాచారం చేశారు. మామ చేసిన చేసిన దారుణానికి అత్తా, భర్త వంత పాడడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటార్సీలో కమల అనే యువతికి అదే పట్టణానికి చెందిన రాజా అనే వ్యక్తితో ఇటీవలే వివాహమైంది. కోటి ఆశలతో అత్త ఇంట్లో అడుగు పెట్టిన కమలకు ఊహించని షాకులు తగిలాయి. కమల ఇంట్లో అడుగు పెట్టగానే అత్త బాత్రూమ్లోకి పిలిచి బట్టలు విప్పమని ఆదేశించింది. దీంతో షాకైన ఆమె ఎందుకుని అడగగా.. నువ్వు కన్నెపిల్లవో కాదో తెలియాలి కదా అని చెప్పింది.
ఇక నగ్నంగా ఉన్న కోడలి శరీర భాగాలను తడిమింది. దీంతో కమలకు చిరెత్తుకొచ్చింది. కానీ, ఏమి చేయలేని పరిస్థితి. అయితే ఇదే విషయాన్ని భర్తకు చెప్పగా.. మా అమ్మ మాటకు ఎదురుచెప్పకుండా నువ్వు కన్నెపిల్ల అని నిరూపించుకో అని అమ్మకు రాజా వంత పలికాడు. ఇక ఆ తర్వాత రోజు కోడలికి మామ గది శుభ్రం చేయమని పంపగా.. లోపలే ఉన్న మామ తలుపులు మూసివేసి ఆమెపై పశువులా మీద పడి అత్యాచారం చేశారు. వదలమని ఎంత మొత్తుకున్నా దారుణం ప్రవర్తించారు. అనంతరం కమల ఈ విషయాన్ని అత్తకు చెప్పగా.. నువ్వు కన్య వా కాదా అని తెలుసుకునేందుకు మీ మామగారు పరీక్ష చేశారని, ఇది తమ ఆచారమని చెప్పుకొచ్చింది. దీంతో షాక్ అయిన కమల పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు అత్త, భర్త, మామపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.