అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో.. ఆడపిల్లకు మాత్రం రక్షణ కరువైంది. నేటి తల్లిదండ్రులు.. ఆడపిల్లకు చాలా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చెబుతుంటారు. కానీ, మగవాళ్లకు మాత్రం ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రం చెప్పడం లేదు. ఈ క్రమంలోనే కొందరు మగాళ్లు.. మృగాలుగా మారి ఆడవారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక నిర్భయ, దిశలాంటి కఠిన చట్టాలు ఎన్ని వచ్చినా ఆడపిల్లలకు, మహిళలకు, ఉద్యోగినులకు రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయిలు నిర్భయంగా తిరగాలని ప్రభుత్వాలు భావిస్తే.. నేరస్తులు నిర్భయంగా, నిర్లజ్జగా తిరిగేస్తున్నారు.
దీంతో రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. నేటి కాలంలో తల్లిదండ్రలకు ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం కూడా ఉండడం లేదు. దీని బట్టీ చూస్తుంటే ఎంత దారుణ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చ. ఇక తాజాగా ఓ యువతిపై దారుణంగా అత్యాచారం చేశారు కొందరు కామాంధులు. అపై దారుణంగా ఆమెపై కిరోసిన్ పోసి కల్చేశారు. కోర్బా జిల్లాలోని బాంగో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గడ్లోని కోర్బా జిల్లాలో ఓ 28 ఏళ్ల మహిళ గురువారం రాత్రి ఇంటికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నలుగురు దుండుగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసి పారిపోయారు.
అయితే మహిళ గొంతు సమీప గ్రామస్తులు వచ్చి సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇన్చార్జి అశోక్ పాండే సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు 50 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గడ్లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.