నేటి సమాజంలో మ‌హిళ‌ల‌ ర‌క్ష‌ణ‌.. గాల్లో దీపంలా మారుతుంది. మహిళల కోసం ఇన్ని రకాల చట్టాలు ఉన్నా ఏ ఒక్కటి వాళ్ల‌కు రక్షణ కల్పించడంలేదు. ఆడవారి మీద అత్యాచారాలు, వేధింపులు సాగుతూనే ఉన్నాయి. కామోద్రేకంతో ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారు ఎంద‌రో. ఇంటా.. బయటా, ఉద్యోగం చేసే చోట నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన వేధింపులు మ‌హిళ‌లు ఎదుర్కొంటూనే ఉన్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. ఇక గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. 

 

కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. ఇక తాజాగా క‌ట్టుకున్న భార్య‌నే ముగ్గురు ఫ్రెండ్స్‌తో రేప్ చేయించాడు ఓ నీచ‌పు భ‌ర్త‌. ఇండోనేషియలోని జకార్తాలో ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జెరోం వృత్తిరీత్యా ఓ డాక్టర్. అయితే జెరోం భార్య త‌న‌తో కాపురం చేయ‌డం లేద‌ని ర‌గిలిపోయేవాడు. ఎందుకంటే ఆమె స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్). ఈమెకు ఇష్టం లేకున్నా పురుషుడితో ఏడాది క్రితం వివాహం జ‌రిపించారు. అప్ప‌టి నుంచీ బలవంతంగా వైవాహిక జీవితాన్ని నెట్టుకొచ్చిన ఈమె.. గ‌త కొన్ని రోజుల క్రితం తన భర్త ఇంటిని వదిలి వెళ్లిపోయింది.

 

ఈ క్ర‌మంలోనే మ‌రో మ‌హిళ‌తో సంబంధం పెట్టుకుంది. అయితే ఎందుకు తనను వదిలేసి వెళ్లావని భర్త అడిగితే, తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్రంగా కుమిలిపోయిన అతడు, తన ఫ్రెండ్స్‌తో ఈ విషయం చెప్పాడు. అనంతరం అతని కళ్ల ముందే, అతని అంగీకారంతోనే అతని ముగ్గరు స్నేహితులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లెస్బియన్ అన్న విషయాన్ని వెల్లడించడం వల్లనే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె పోలీసుల‌కు మొర పెట్టుకుంది. ఇక బాధితురాలు చెప్పిన వివ‌రాలు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నింధితుల‌ను అరెస్ట్ చేసి.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: