ఈ మద్య మనిషి భయంకరమైన మృగంగా మారిపోతున్నారు.  అసలు మృగాలకు కూడా ఓ ధర్మం ఉంటుంది.. ఆకలి వేసినపుడు మాత్రమే దాడి చేసి తింటాయి. కానీ మనిషి మాత్రం తక కామ కోరిక తీర్చుకోవడానికి.. డబ్బుకోసం, పేరు ప్రఖ్యాతల కోసం కొన్ని సార్లు మృగంగా మారుతుంటారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వల్ల చాలా మంది ఉన్మాధులుగా మారుతున్నారండంలో అతిశయోక్తి లేదు.   ఓ తనయుడు తనతల్లి అంత్యక్రియలకు చేయనని మృతదేహాన్ని రోడ్డుపై పడవేశాడు.. చైనాలో ఓ తల్లిని బతికి ఉండగానే బొందపెట్టి వచ్చాడు.. వరంగల్ లో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక్క హత్య కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు బలితీసుకున్నాడు.  భార్యతో జరిగిన చిన్న గొడవ.. హత్యాయత్నానికి దారి తీసింది.

 

 డబ్బు ఇవ్వలేదని  కోపోద్రిక్తుడై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. సంఘటన తెలుసుకున్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను మల్కాన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. శరీరం 80 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. భార్యపై కిరోసిన్‌ పోసే క్రమంలో సుమంత్‌కు కూడా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  తాజాగా బతికి ఉండగానే ఓ చిన్నారిని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆ తల్లి ఎంత నిర్థయగా.. ఊపిరి పోసుకున్న బిడ్డను బతికుండగానే మట్టిలో కప్పిపెట్టింది. అక్కడే పనులు చేసుకుంటున్న కూలీలు బిడ్డ ఏడుపు విని తవ్వి చూడగా అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు.

 

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సిదార్ధ నగర్‌‌లో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అక్కడి కూలీలకు చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్లిన కూలీలకు మట్టిలో నుంచి చిన్నారి చేయి బయటకు కనిపించింది. అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా.. అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను కాపాడిన కూలీలు హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారికి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: