మహిళ ల పై ఎన్నో  చట్టాలు అమలు చేస్తున్న కూడా చాలా మంది మగ మృగాళ్లు కామదహంతో రెచ్చిపోతున్నారు.. రోజుకో యువతి బలవుతున్నారు .. అయిన కూడా కామాంధుల కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారు.. ఇంట్లో పిల్ల లు ఉన్న కూడా చాలా మంది బయట సుఖాన్ని పొందాలని భావించారు .. దాంతో వావి వరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.  అసలు విషయానికొస్తే ఓ బాలికపై అక్క భర్తనే ఘాతుకానికి పాల్పడ్డాడు.. 

 

 

 


వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 17ఏళ్ల బాలికపై అక్క భర్త లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. కంచిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు కోల్‌కతాలో పనిచేసే ఓ వ్యక్తితో కొంతకాలం క్రితం వివాహమైంది. చిన్న కూతురు పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. ఈ ఏడాది జనవరిలో అత్తింటికి వచ్చిన అతడు మరదలికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడి కోల్‌కతాకు వెళ్లిపోయాడు.

 

 

 

 

కొద్ది రోజులకు కూతురు గర్భం దాల్చిన ఘటన తెలుసుకొని ఆమె తల్లి నిలదీసింది.. దీంతో కూతురిని గట్టిగా నిలదీయడంతో అల్లుడు చేసిన ఘనకార్యం బయట పడింది..ఫోన్ చేసి నిలదీయగా లాక్‌డౌన్ పూర్తికాగానే ఇంటికొస్తానని, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెండు కుటుంబాల పరువు పోతుందని, అందువల్ల ఆమెకు అబార్షన్ చేయించాలని, దానికయ్యే ఖర్చులు తాను ఇస్తానని అతడు నమ్మబలికాడు.దాంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అలా అబార్షన్ అయ్యాక ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె మరణించింది.. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కంచిలి ఎస్‌.ఐ.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: