అనుమానం పెనుభూతమై అది కాస్త వేరే వారి ప్రాణం తీసే వరకు వచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఒక వ్యక్తిపై దాడి జరిగింది. ఇక అసలు విషయంలోకి వెళితే... నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక వ్యక్తి పై కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సత్యనారాయణరెడ్డి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో పనిచేస్తూ మిర్యాలగూడలోని శాంతినగర్ లో జీవనం కొనసాగిస్తున్నారు. ఇక అతని ఇంటి పక్కనే పెయింటింగ్ పనిచేసుకుంటూ రసూల్ అనే వ్యక్తి కుటుంబం జీవిస్తోంది.

IHG


అయితే ఇక కొద్ది రోజుల క్రితం సత్య నారాయణ రెడ్డి భార్య గర్భవతి కావడంతో తన పుట్టింటికి వెళ్ళింది. ఇదా దానితో రసూల్ తన భార్యతో సత్యనారాయణ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న అనుమానం ఆయనలో తలెత్తింది. ఈ విషయం మీద రసూల్ 27 వ తారీఖున మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించాడు. ఈ కేసు నిమిత్తం సత్యనారాయణ రెడ్డి ని పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం పిలిపించారు.


ఇక దీంతో అతడు శనివారం నాడు పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆయన పై దాడికి దిగారు. దీనితో ప్రాణాలు కాపాడుకునే నేపథ్యంలో సత్యనారాయణరెడ్డి ఆ పోలీస్ స్టేషన్ లోకి పరిగెత్తాడు. ఆ దాడిలో సత్యనారాయణ రెడ్డికి బలమైన గాయం కావడంతో పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి విచారణ చేపడుతున్నారు. నిజంగా కొంతమంది ముర్కుల వాళ్ళ అసలు నిజాలు గ్రహించని వారి వల్ల ఎదుటి వారి ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: