ప్రేమ అనేది ఎంత గొప్పది అన్న విషయాన్ని వేరే లా చెప్పనక్కర్లేదు.. అంత మధుర మైనది అని కవులు వర్ణించారు.. అందుకే ఇప్పుడు ప్రేమికులు చాలా మంది ప్రేమ ను పొందాల ని తమ పార్టనర్ తో ఏకాంతాన్ని పొందాలని భావిస్తున్నారు..అలాంటి తరుణంలో ఎన్నో అఘాయిత్యాలు కూడా చేస్తున్నారు.. అందుకే వార్తల్లో రోజు ఏదోకటి వింటూనే ఉంటాం.. 

 

 

 

 

తాజాగా మరో ఘటన అందరి నీ కదిలించి వేసింది.. విషయాని కొస్తే..చాలాకాలం పాటు కొన సాగిన అక్రమ సంబంధంలో విరామం వచ్చింది. అయితే ప్రియుడు మళ్లీ ఆమె తో సహజీవనం చేయడానికి ఉత్సాహం చూపిస్తుండగా, ఆమె మాత్రం ససేమిరా అంటోంది. దీంతో మాజీ ప్రియురాలిపై కక్ష పెంచుకుని ఆమె ప్రాణాలు తీసేందుకు యత్నించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం లో జరిగింది. గంటావారిపల్లె గ్రామానికి చెందిన మహిళ(45) తిరుపతి లోని ఓటేరు ప్రాంతానికి చెందిన జానకిరామిరెడ్డి ఇంట్లో పనిమనిషి గా పనిచేసేది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది.. 

 

 

 


ఆమె ససేమిరా అనడంతో కోపోద్రుడైన అతను పక్కనే ఉన్న రాయితో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో జానకిరామిరెడ్డి ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించి తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే జానకిరామిరెడ్డి కత్తెరతో తనను తాను గాయపరుచుకున్నాడు. ఎస్సై సుమన్‌ తన సిబ్బందితో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స ను అందించారు.. భాదితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: