రాయల సీమ అంటే గుర్తొచ్చేది ఫ్యాక్షనిజం.. ముఖ్యంగా అందరికి వణుకు పుట్టించేది మాత్రం కడప.. ఈ జిల్లా లో అప్పటి కి ఇప్పటి కి మారినది ఫ్యాక్ష నిజం అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా నది రోడ్డు మీద ఒకరి నొకరు చంపుకుంటూ వస్తున్నారు. తాజా గా ఓ ఘటన అందరి కి వణుకు పుట్టిస్తుంది. ఓ వ్యక్తిని దారుణం గా పోలీస్ స్టేషన్ ఎదుట నే గొంతు కోసి చంపేశారు. 

 

 

 


వివరాల్లోకి వెళితే.. చిన్ననాటి స్నేహితుల పై కక్ష పెంచుకున్న వ్యక్తి వారి ని అంత మొందించేందుకు పక్కా ప్లాన్ చేశాడు. ఇద్దరినీ హత్య చేసేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. టార్గెట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ అప్రమత్తం కావడం తో పరుగులంకించుకున్నాడు. అయినా వదలని స్నేహితులు ఏకం గా పోలీస్ స్టేషన్ ఎదుటే గొంతు కోసేశారు. ఈ దారుణ ఘటన కడప పట్టణం లో చోటుచేసుకుంది.

 

 

 


కడపకు చెందిన ఖాదర్, బాలాజీ, శాలు చిన్నతనం నుంచి స్నేహితులు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఖాదర్ కక్ష పెంచుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. మద్యం మత్తులో వారిని హత్య చేసేందుకు వెళ్లాడు.నిద్రపోతున్న బాలాజీ గొంతుకోసేందుకు ప్రయత్నించడం చూసి శాలు అడ్డుకున్నాడు. ఆగ్రహం చెందిన ఖాదర్ అతనిపై కూడా దాడికి దిగాడు. ఈలోగా బాలాజీ నిద్ర నుంచి తేరుకుని అప్రమత్తం కావడంతో ఇద్దరినీ ఎదుర్కోలేక ఖాదర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. భయంతో పరిగెడుతూ ఖాదర్‌ కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ‌ కిందపడిపోవడంతో శాలు కత్తితో ఖాదర్ గొంతుకోసేశాడు.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: