నేటి కాలంలో ఒక మనిషిని చంపడం ఎంత తేలికగా మారిందో ఈనాటి దారుణాలను చూస్తుంటే అర్ధం అవుతుంది.. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాణాలను చీమలను నలిపినట్లుగా నలిపేస్తున్నారు.. కన్నవారు, కట్టుకున్నవారు అనే తేడా లేకుండా, జాలి, దయ మరచి కౄరంగా ప్రవర్తిస్తున్నారు.. ఇక భార్యభర్తల మధ్య బంధాలైతే చిత్తు కాగితాలకంటే హీనంగా మారిపోయాయి.. కొందరికైతే ప్రేమించుకునేటప్పుడు ఏది గుర్తుకు రాదు.. పెళ్ళిచేసుకుని పిల్లలను కన్నాక అన్నీ గుర్తుకు వస్తాయి.. అప్పటి నుండి భార్యభర్తల మధ్య పడక విడిపోయి పిల్లలను అనాధలుగా మారుస్తున్నారు.. మరికొందరైతే చావడమో, చంపడమో చేస్తున్నారు..

 

 

ఇక ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.. ఆ వివరాలు చూస్తే.. బంజారాహిల్స్‌ రోడ్డు నం.2 లోని ఇందిరానగర్‌లో నివసించే రుడావత్‌ అనిల్‌(31) వికారాబాద్‌ జిల్లాకు చెందిన అనిత(29) వీరిద్దరు గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.. వీరి దాంపత్యంలో వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలుగగా నెలన్నర క్రితం మరో బాబు పుట్టాడు.. ఇక జీవనోపాధిగా సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామగ్రి అద్దెకిస్తూ జీవిస్తున్నారు. ఇలా సాగుతున్న వీరి సంసారంలో అప్పుడప్పుడు తన భార్యను అనిల్‌ కట్నం కోసం వేధిస్తుండేవాడట. ఈ విషయంలో రెండేళ్ల క్రితం అనిల్ భార్య ఇతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

 

 

దీంతో అనిల్ మనసులో భార్యపై ద్వేషాన్ని పెంచుకుని వేధింపులకు పాల్పడేవాడు.. ఈ క్రమంలో మొన్న శనివారం రాత్రి పీకల దాకా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగిన అనిల్ విచక్షణ కోల్పోయి, వాటర్ హీటర్‌తో దారుణంగా కొడుతుండగా, వారి పెద్ద కుమార్తె  అమ్మను కొట్టొద్దు నాన్నా అని ప్రాథేయపడినా కనికరించలేదు. చివరికి ఆ అభాగ్యురాలు ప్రాణాలు వదలడంతో పిల్లలను వదిలేసి పరారయ్యాడట. ఇక సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా నెలన్నరబాబు తల్లిపాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండటం, అనాధలైన మిగిలిన ముగ్గురు పిల్లల బేల చూపులు అక్కడున్న ప్రతివారి హృదయాన్ని కదిలిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: