ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళల కోసం అనేక రకముల చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా వారి తీరు మారటం లేదు. ఇక తాజాగా ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆమెను తీవ్రంగా కొట్టి సజీవ సమాధి చేసిన దారుణమైన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కొడవలూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన సుభాషిని అనే మహిళ భర్తను వదిలేసి తన కూతురుతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా ఆమెకు కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన సాములు అనే మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. అంతే కాకుండా ఆ వ్యక్తి రోజు ఆమె ఇంటికి వచ్చి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఇటీవల సాములు మద్యం బాటిల్ తీసుకొని ఆమె ఇంటికి రావడం జరిగింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించగా వారి ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. ఈ తరుణంలోనే సాములు ఆగ్రహానికి గురై కర్రతో సుభాషిని తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడే అక్కడే స్పృహ కోల్పోవడం జరిగింది.

 

 ఇక ఆమె స్పృహ నుంచి బయటకు వస్తే విషయం బయటకు తెలుస్తుందని ఆందోళనలతో ఆమెను పక్కనే ఉన్న పొలంలోకి తీసుకుని వెళ్లి బతికుండగానే గొయ్యి తీసి పాతి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే సాములు అక్కడినుంచి పారి పోవడం జరిగింది. ఈ విషయాన్ని సుభాషిణి కూతురు వాళ్ళ బంధువులు అందరికీ తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనితో పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని... ఊరిలో ఉన్న సాములు కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: