ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు రోజుకి హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొందరు  యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు అంటే నమ్మండి. ఇలాంటి దారుణమైన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొందరు యువకులు తిరుపతిలో గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. వారికి ఒంటరిగా నడిచి వెళ్తున్న వారే టార్గెట్. అంతేకాకుండా వారిపై దాడులు నిర్వహిస్తున్నారు.

IHG's - समाचार नामा


ఇక ఈ తరుణంలోనే ఒక యువకుడిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. గంజాయి మత్తులో కొందరు యువకులు అతనిపై దాడిచేసి కత్తితో పొడిచి చంపారు. వెంటనే గమనించిన అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇదే తరహాలో చిత్తూరు జిల్లాలో కూడా గంజాయి మత్తులో యువకులు రెచ్చి పోతున్నారు. జిల్లాలోని తాతయ్యగుంటకు చెందిన కొందరు యువకులు గంజాయి మత్తులో రోడ్డుపై వెళ్తున్న ఒక యువకుడు పై దాడి చేయడం జరిగింది. గంజాయి మత్తులో వారు కత్తితో వెంకట సాయి అనే యువకుడిపై దాడులు నిర్వహించారు.


ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా మామూలుగా అయ్యాయి అని స్థానికులు తెలుపుతున్నారు. ఇక ఈ ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరడం జరిగింది. ఒకవైపు వెంకట సాయి పై దాడికి పాల్పడిన ఆరుగురు యువకులపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే సంబంధించిన విషయాలు పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. కొందరు యువకులు ఈ మత్తులో పది వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: