ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాపకింద నీరులా విజృంభిస్తుంటే... మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ అనేక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మహిళల కోసం అనేక రకాలైన చట్టాలు ప్రభుత్వాలు తీసుకొని వచ్చిన కూడా అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఎటువంటి భయం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు.


ఇకపోతే ఈ మధ్య కాలంలో సజీవ దహనాలు అంటూ కొత్త రీతిలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో ఒక యువకుడు ఆమెను సజీవంగా దహనం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లాలో హతుడు భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే మహిళగా గుర్తించడం జరిగింది. కొన్ని నెలల కిందట ఓ మహిళ వీడియో క్లిప్ ను యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దీనితో ఆ మహిళా బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీనితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అనే అనుమానంతో మహిళ బంధువులు ఇటీవల ఆ బాధితుడిని ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అంతే కాకుండా ఆ బాధితులు అతని పై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడం జరిగింది కుటుంబ సభ్యులు. దీనితో యువకుడి హత్యతో బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసు వాహనాలు సైతం తగల బెట్టడం జరిగింది. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో సంఘటన జరిగిన ప్రాంతానికి అదనపు పోలీసు అధికారులను  ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలకు ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: