ఆడవాళ్ళు ఓర్పు తో ఉంటారన్న విషయం తెలిసిందే.. అది కూడా కొంత వరకు మాత్రమే ..వాళ్లకు కోపం వస్తె అపర కాళిల గా విరుచు కు పడతారాన్నది ఇప్పటి కాలం లో జరుగుతూ వస్తుంది.. అయితే చాలా వరకు ఆడవాళ్ళు కోపొద్రులుగా మారి కష్టపెట్టిన వారిని  వదిస్తూ వస్తున్నారు.. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. భర్త ఎంత చెప్పిన వినకుండా రోజు తాగొచ్చి కొడుతున్నాడు..అయితే తాగొద్దని ఎంత చెప్పినా వినకుండా ఘర్షణ పడుతున్నాడు.. దీంతో విసిగి పోయిన భార్య కత్తి తో దారుణం గా నరికి చంపింది..

 

 


వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తని భార్య కిరాతకంగా హత్య చేసింది. కత్తి పీట తో నరికి చంపేసింది. ఈ ఘటన స్థానికం గా తీవ్ర కల కలం రేపింది. జిల్లాలోని మైదుకూరు వెలుగు అనిల్ రజినీ దంపతులు. మద్యానికి బానిసైన అనిల్ ప్రతి రోజూ మద్యం తాగొచ్చి భార్య ని వేధింపు  లకు గురిచేసేవాడు. ఎంత చెప్పినా కూడా వినకుండా రోజు తాగొచ్చి గొడవ చేసేవాడు..ఇంట్లోకి ఎది తీసుకు రమ్మని అడిగిన కూడా కొట్టేవాడు .. దాంతో విసిగి పోయినా ఆమె పక్కనే ఉన్న కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపింది.

 

 


గత మూడు రోజుల నుంచి భర్త వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయిన భార్య కత్తిపీటతో దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్త అనిల్ పై  విచక్షణా రహితంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: