నేటి స‌మాజంలో పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా కామన్ అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. ఇక ఈ అక్ర‌మ‌ సంబంధాల వ‌ల్ల ఎంద‌రివో కాపురాలు కూలిపోవ‌డంతో పాటు వారి పిల్లల జీవితాలను సైతం నాశనం చేస్తున్నాయి. తాజాగా ఓ వ్య‌క్తి భార్య‌ను కాద‌ని.. కొడుకు భార్య‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో.. కొడుకు ప‌గ‌తో తీవ్రంగా ర‌గిలిపోయాడు.

 

ఈ క్ర‌మంలోనే త‌ల్లితో ప్లాన్ వేసి.. క‌న్న తండ్రినే హ‌త‌మార్చాడు స‌ద‌రు కొడుకు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా రుద్రారు మండలం అంబం గ్రామంలో గంగారం అనే వ్య‌క్తికి పెళ్లై భార్య సాయవ్వ , పిల్లలు ఉన్నారు. ఇక ఇటీవ‌ల గంగారం పెద్ద కొడుకు గంగాధర్ కి కూడా పెళ్లయ్యింది. అయితే గంగారం చూపు కొడుకు భార్యపై పడింది. ఈ క్ర‌మంలోనే భార్య సాయవ్వ, కొడుకు గంగాధర్‌కు  తెలీకుండా కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు  గంగారం. అయితే ఈ విషయం గంగాధర్, సాయవ్వలకు తెలిసిపోయింది. త‌న త‌ల్లిన కాద‌ని ఏకంగా త‌న భార్య‌తోనే తండ్రి అక్ర‌మ సంబంధం పెట్టుకోవ‌డంతో గంగాధ‌ర్ కోపంతో ఊగిపోయాడు. 

 

ఈ క్ర‌మంలోనే తండ్రితో గంగాధర్, సాయవ్వలు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. పద్దతి మార్చుకోవాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, గంగారం మాత్రం ప‌ద్ద‌తి మార్చుకోలేదు. భార్య‌, కొడుకు మాట లెక్క‌చేయ‌లేదు. దీంతో గంగాధర్, సాయవ్వకు ఏం చేయాలో తెలియ‌క‌.. కోపంతో గంగారంపై క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. దీంతో గంగారం అక్కడికక్కడే చ‌నిపోయాడు. అయితే గంగాధర్, సాయవ్వ త‌మ‌కేమీ తెలీన‌ట్లు న‌టించారు. మ‌రియు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తండ్రిని చంపేశారటూ చెప్పుకొ‌చ్చారు. అయితే అనుమానం వ‌చ్చిన పోలీసులు.. వారి స్టైల్‌లో ప్ర‌శ్నించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో  గంగాధర్, సాయవ్వల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  

 

 
  
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: