రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనపడింది. అయితే అద్భుత దేహం తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని రైల్వే పట్టాలపై పడేసినట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఈ సంఘటన నాలుగు రోజుల క్రితమే జరిగినట్లు పోలీసులు అంచనాకి వచ్చారు. జూన్ రెండో తారీఖున బన్సీలాల్ పేటకు చెందిన ఒక యువకుడు మిస్సింగ్ కేస్ రావడంతో ఈ మృతదేహం అతనితో కాదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే... బైబిల్ హౌస్ ప్రాంతంలోని రైల్వే పట్టాల కు దూరంగా ఒక చెట్ల పొదల్లో ఈ మృతదేహం లభించింది. ఓ మృతదేహం అక్కడ పడి ఉన్న సమాచారంతో గాంధీనగర్, మహంకాళి పోలీసులు అక్కడికి చేరుకొని నిర్మాణం ప్రదేశం కావడంతో పూర్తిగా చీకటి ఉన్న సమయంలో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. దీనితో ఆ మృతదేహాన్ని పూర్తి వివరాలు పోలీసులు తెలపలేదు. అంతేకాదు ఆ మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించడం కూడా చాలా కష్టంగా ఉండటంతో అక్కడే ఉంచారు పోలీసులు. కాకపోతే నేడు ఉదయం ఆ మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు తెలియజేశారు. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.


ఇకపోతే మే 31 వ తేదీన బన్సీలాల్ పేట కు చెందిన ఒక యువకుడు మిస్సింగ్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆ యువకుడు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో కలిసి ఉండడం స్థానికులు గమనించినట్లు పోలీసులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని బంధువులు కూడా ధ్రువీకరించారు. ఇక విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు నిందితులను బుధవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారిని విచారించడంతో బన్సీలాల్ పేటలో చంపేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా వారు తెలిపిన మేరకు మహంకాళి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: