ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా 9 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న గొర్రెకుంట సామూహిక హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు విచారణలో హంతకుడు సంజయ్ కుమార్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు.

 

 

రఫీకా అనే మహిళతో సహజీవనం చేసిన సంజయ్ కుమార్.. ఆమె వివాహం చేసుకోమని గొడవ చేసేసరికి రైలులో తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత ఆమె గురించి పదే పదే అడుగుతున్న ఆమె కుటుంబ సభ్యులను కూడా నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత వారిని బావిలో తోసేసి దారుణంగా హతమార్చాడు. అయితే ఇప్పుడు కొత్తగా తెలుస్తుందంటంటే.. రఫీకా 14 ఏళ్ల కూతురిపై సంజయ్ కుమార్ కొంతకాలంగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు.

 

 

దాని ఫలితంగా ఆమె గర్భం కూడా దాల్చిందట. రఫిక కూతురి మీద అత్యాచారం చేసిన విషయాన్ని సంజయ్ కుమార్ పోలీసు విచారణలో అంగీకరించాడట. దీంతో వరంగల్ లోని ఓ ఇంట్లో రఫిక కూతురికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆమె గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెబుతున్నారు. దీంతో సంజయ్ కుమార్ పై కొత్త సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు పోలీసులు.

 

 

రఫీకా కూతురుకు 14 ఏళ్లే కావడంతో సంజయ్ కుమార్ పై అత్యాచారం, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసారు. బావిలో 9 మంది మృతదేహాల కేసును పోలీసులు ఈ కేసును 72 గంటల్లో ఛేదించి నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేశారు. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. అతని కస్టడీ గురువారంతో ముగిసింది. కోర్టులో ప్రవేశపెట్టారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: