ప్రేమ ఎంత మధురం అని అంటారు కానీ.. కొందరు అదే ప్రేమను ఆయుధం చేసుకొని నరకం చూపిస్తారు. అలానే నరకం చూపించాడు ఓ ప్రియుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కి చెందిన హర్‌దేవ్ శర్మ జార్ఖండ్‌లోని హజిర్‌బాగ్‌కి చెందిన 22 ఏళ్ళ యువతిని మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. దీంతో ఏమి తెలియని యువతీ అతనితో వెళ్లిపోయింది. అయితే రాజస్థాన్ తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను నంద్‌లాల్‌ యాదవ్ అనే వ్యక్తికి  అమ్మేశాడు. అయితే అది ఆమెకు తెలియక అతని ఇంట్లో ఉంది. 

 

అయితే ఆమెను ఆరోజు రాత్రే ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. అయితే ఆ వృద్ధుడు ఆమెను లక్షన్నరకు కొన్నట్టు అతను చెప్పడంతో షాక్ కి గురైంది. రాష్ట్రాలు దాటి వచ్చాక ఆ యువకుడి అసలు రూపం బయటపడటంతో ఎం చెయ్యలేకపోయింది. ఇంకా కొన్న వ్యక్తి  ఆమెకు నరకం చూపించాడు. ఇంకా అలాంటి నరకం రోజులు అనుభవిస్తున్న ఆమెకు లాక్ డౌన్ ఆమెకు ఒక వరంలా మారింది. దీంతో తనతో పాటు మరో ఇద్దరు బాధితులతో కాలినడకన వెళ్తున్న వలస కూలీల్లో కలిసిపోయి ప్రాణాలతో తిరిగొచ్చింది. 

 

ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. అయితే యువతి తల్లితండ్రులకు ఫోన్ చెయ్యడంతో జార్ఖండ్‌లో ఉన్న వారు ఢిల్లీలోని ఓ ఎన్జీవో నిర్వాహకుడికి విషయం తెలిపారు.  దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా ఎస్పీ పోలీస్ ఔట్‌పోస్టులను అప్రమత్తం చేశారు. బార్డర్ దాటినా వెంటనే సమీపంలోని పోలీస్ ఔట్‌పోస్టును సంప్రదించాలని బాధితురాలికి సూచించారు. 

 

యుపిలోకి అడుగు పెట్టగానే ఆగ్రా జిల్లాలోని పోలీసులు ఆమెను కాపాడారు. ఆమె స్వగ్రామం అయినా జార్ఖండ్‌లోని హజిర్‌బాగ్‌కి చేర్చారు. ఇంకా బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రియుడు హర్‌దేవ్ శర్మ, అతని భార్య రేఖా దేవి, ఆమెను కొనుక్కున్న యాదవ్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: