ఎందరో అమ్మలు.. పిల్లలు లేరు అని.. మానసికంగా కుంగిపోయి.. కనిపించిన దేవుళ్లను ముక్కుతూ.. డాక్టర్లను కలుస్తూ పిల్లలను కంటున్నారు. కానీ ఓ తల్లి మాత్రం అందుకు బిన్నం. పిల్లలను కనడం ఇష్టం లేక జిల్లేడు పాలు తాగింది. ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విడ్డను కనడం ఇష్టం లేని ఓ గర్భిణీ అబార్షన్‌ చేయించుకుంటా అంటే ఒప్పుకోలేదు. దీంతో ఈ దారుణానికి పాల్పడింది. 

 

కుటుంబసభ్యులు అబార్షన్ వొద్దు అన్నందుకు కోపంతో తన ప్రాణాలు.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. అయితే అది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెకు ఇప్పటికే ఏడాదిన్నర పాప ఉంది అని మళ్లీ గర్భం దాల్చడంతో ఈ దారుణానికి పాల్పడింది అని కుటుంబసభ్యులు తెలిపారు. 

 

అయితే కుటుంబసభ్యులు సరైన సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆమెను నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఎంత ఇష్టం లేకపోయినా మాటలు లేని బిడ్డను ఇంత దారుణంగా చంపాలి అని అనుకోవడం పెద్ద నేరం అని తిడుతున్నారు. కాగా ఎంతో మంది తల్లుల్లు పిల్లలు లేక గొడ్రాలు అని అనిపించుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. 

 

ఈరోజు కూడా ఓ కన్నీళ్లు పెట్టించే ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. పిల్లల కోసం దాదాపు 14 ఏళ్ళు ఎదురు చుసిన ఓ మహిళా గర్భం దాల్చింది. అయితే ఇంకో నెల ఉంటె ఇద్దరు కావాలా పిల్లలకు జన్మనిచ్చేది. అలాంటి సమయంలో విధి వింత నాటకం ఆడింది. ఎంతో సున్నితంగా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆ మహిళా చాటి నొప్పి వచ్చి మరణించింది. ఆమెకు పుట్టిన కవల పిల్లలు కూడా మరణించి విషాద ఛాయలు మిగిల్చారు. పిల్లల కోసం ఓ తల్లి మరణిస్తే.. పిల్లలు ఒద్దు అని ఓ మహిళా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంత వింత నాటకం ఎక్కడ చూసి ఉండము

మరింత సమాచారం తెలుసుకోండి: