కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లో ఒక నీచమైన భర్త కట్టుకున్న భార్యపై నీచాతి నీచమైన పనికి ఒడిగట్టాడు. తన ఐదేళ్ల కొడుకు ముందే తన 25 ఏళ్ల భార్య బట్టలు విప్పి ఆల్కహాల్ బలవంతంగా తాగించి తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం రోజు ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకోగా... భర్త తో కలిపి నలుగురు స్నేహితులను కూడా పోలీసులు శుక్రవారం రోజు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంఘటన చోటు చేసుకుంటున్న సమయంలో ఈ పనికి ఒడిగట్టిన భర్త తన కుమారుడిని అతికిరాతకంగా కొట్టాడని తెలుస్తుంది. బాధితురాలు పోలీసులకు ఏమని చెప్పింది అంటే... గురువారం రోజు తన భర్త తనని, ఇద్దరు పిల్లలను పుతుసురిచి సమీపంలోనే ఉన్న బీచ్ కి తీసుకెళ్లాడని ఆ తర్వాత తన భర్త అతని స్నేహితుని ఇంటికి తీసుకెళ్లాడని... అక్కడే తన పెద్ద కొడుకు ముందే తనకు ఆల్కహాల్ తాగించి ఆ తర్వాత స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. 


అయితే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆమెను ఓ రోడ్డు పై పడేసి వెళ్ళిపోయాడు భర్త. ఆ రోడ్డు మార్గం లోనే వెళుతున్న ఒక నాలుగు చక్రాల వాహనదారుడు ఆమెను గమనించి... తన కారులో కూర్చోపెట్టి బాధితురాలి ఇంటికి తీసుకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత తాను కొన్ని ఛానళ్లకు ఈ సమాచారం అంతా అందించాడు. కదినంకులం పోలీస్ అధికారి మాట్లాడుతూ బాధితురాలి నుంచి సరైన నిజానిజాలు తెలిసిన తర్వాత, ఆధారాలు పూర్తిగా లభించిన తర్వాత నిందితులను అరెస్టు చేస్తామని తెలిపాడు. సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం డిశ్చార్జి అయిన బాధితురాలు తనపై నిందితులు సిగరెట్లతో కాల్చారని చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ సంఘటన అందరి విస్మయానికి కారణమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: