సినిమాల్లో ప్రేమ కధలు సుఖాంతంగా ముగిస్తారు దర్శకులు.. కానీ నిజ జీవితంలో మాత్రం అవే ప్రేమలు విషాదంతో అంతం అవుతాయి.. దాదాపుగా నిజ జీవితంలో జరిగే ప్రేమల్లో కనబడే ట్విస్ట్‌లు ఇవే. తెరమీది ప్రేమను సంతోషంగా ఆస్వాధించినట్లుగా, ఏ తల్లిదండ్రులు కూడా నిజ జీవితంలో వారి పిల్లల ప్రేమను ఒప్పుకోరు. ఒకవేళ తల్లిదండ్రుల అంగీకారంతో ప్రేమించిన వారు ఒక్కటైయ్యారంటే కలిగే ఆ సంతోషమే వేరు. ఇకపోతే కొడుకు ప్రేమిస్తే దానికి ఆ తండ్రి బలైన ఘటన సినిమాల్లోనే చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు నిజజీవితంలో కూడా జరిగింది..

 

 

ఆ విషాద ఘటన తాలూకు వివరాలు చూస్తే.. యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం జనగాం శివారులో ఈ నెల 5న జరిగిన హత్యను పోలీసులు చేధించారు. ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమని తేల్చారు.. జనగాంకు చెందిన గడ్డం గాలయ్య కూతురు నవనీత, గందిగొల్ల గాలయ్య కొడుకు బాబు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి తండ్రి వేరే అతనితో నిశ్చితార్థం చేశాడు.. కాగా తాను బాబును ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో తమ పరువు పోయిందని బాబు మీద, అతని తండ్రి గాలయ్య మీద నవనీత తండ్రి, ఆమె అన్నదమ్ములు కక్ష పెంచుకుని, తమ సమీప బంధువులతో కలిసి బాబు తండ్రి హత్యకు కుట్ర చేశారు.

 

 

ఈ నేపధ్యంలో బాబు తండ్రి గాలయ్య ఈ నెల 5న మోటార్​ సైకిల్​పై సంస్థాన్​ నారాయణపురానికి వెళ్లుతున్న విషయం తెలుసుకున్న నవనీత తండ్రి, అన్నదమ్ములు అతన్ని వెంబడించి జనగాం గ్రామ శివారులో మాటు వేశారు. ఇక తన పని ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన గాలయ్యను అడ్డకుని కత్తితో దాడి చేసి, హత్య చేశారు. ఈ హత్యకేసులో పోలీసులకు అనుమానం వచ్చి నవనీత అన్నదమ్ములను పట్టుకుని విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి నల్లగొండ కోర్టులో హాజరుపరిచారట..

మరింత సమాచారం తెలుసుకోండి: