ఆడవాళ్ళకు , చిన్న పిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది..మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధుల రాక్షసత్వాన్ని తీర్చుకుంటున్నారు.. పసికందుల నుంచి పండు ముసలాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళల్లో ఎటువంటి మార్పు రాలేదు.. రోజుకొకరు బలవుతున్నారు.అయిన కానీ సమాజంలో ఆడవాళ్ళకు రక్షణ మాత్రం పేరుకే పరిమితమవుతుంది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే..బాలాసోర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న కామాంధుడు పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌‌లో మూసివేసి ఉన్న పాఠశాలకి వెళ్లిన హెచ్‌ఎం అదే సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఉన్న బావి నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు వచ్చిన బాలికపై కన్నేశాడు. తనకు కల్లబొల్లి మాటలతో తనవైపు తిప్పుకున్నాడు..అంతేకాకుండా తన విచిత్ర కోరికలను తీర్చుకోవాలని అనుకోని ఆ అమ్మాయిని తన రూం కు తీసుకెళ్లి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించే వాడు..

 

 

 

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. కామంతో కళ్లుమూసుకుపోయి బాలికని అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక కీచక టీచర్ వేధింపుల గురించి తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్న అతను ఇలా చేయడం పై అందరూ షాక్ అవుతున్నారు..

 

 


బాలిక శరీరాన్ని అసభ్యంగా తాకుతూ పైశాచికం ప్రదర్శించాడు. అభం శుభం తెలియని బాలికని లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే స్కూల్ నుంచి తీసివేస్తానని భయపెట్టాడు. ఇంటికెళ్లిన బాలిక హెచ్ఎం కీచకపర్వాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ కామాంధుడు ఊరి నుంచి పరారైయ్యాడు. పోలీసుల చాక చక్యంతో కామంధుడిని కటకటాల పంపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: