లాక్ డౌన్ కాస్త విరమించడం తో ఎవరి దందాలు వాళ్ళు జోరుగా సాగిస్తున్నారు.. జంట నగరాల్లో రాత్రి పూట అయితే ఇంక బడాబాబుల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది.వ్యభిచారం ఎక్కడ చూసినా పడగ విప్పింది. గెస్ట్ హౌస్ లో లేదా పార్టీల పేరుతో విదేశీ అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.. అందుకే ఇప్పుడు పోలీసులు కరోనా భయం నుంచి వ్యభి చారుల గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు. తాజాగా హైదరాబాద్ ‌లోని గుట్టుగా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చేధించారు. నిర్వాహకు లతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.

 

 


హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ మిస్కిన్‌ (30) దంపతులు సంపాదన కోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నారు. షేక్‌ ముస్తాక్ ‌(27) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబయి నుంచి ఇద్దరు యువతుల ను నగరానికి రప్పించారు. పాతబస్తీ, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. విటులు ఫోన్‌ చేస్తే ఆటో లో షేక్‌ ముష్తాక్‌ ఆ యువతులను వారింటి కి తీసుకు వెళ్తాడు. మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్‌కాలనీలో ఓ ఇంటిని ఈ ముఠా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

 

 

 

 అయితే, ఆ ఇంటికి అర్ద రాత్రి కూడా అబ్బాయిలు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన ఇద్దరు సెక్స్‌వర్కర్లను సంరక్షణ గృహానికి తరలించారు. కరోనా వైరస్ కారణంగా సోషల్‌ డిస్టెన్స్ పాటించాలంటూ ఓ వైపు అధికారులు, వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తుంటే కొన్నిచోట్ల ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడటం అందరినీ కదిలించివేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: