బ్రతువు దేరువుకోసం పట్టణానికి వచ్చిన ఓ యువతిని బలంతంగా కొందరు దుర్మార్గులు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు..ఈ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతిని ఉపాధి కల్పిస్తామని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. బాధితురాలు గాజువాక పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. 

 

 

కృష్ణా జిల్లా గుడి వాడ దరి ధనియాలపేటకు చెందిన ఓ యువతి చదువు మధ్యలో ఆపేసి ఓ షాపులో పనిచేసేది. అయితే కొద్దీ రోజుల క్రితం తల్లితో గొడవ పడటంతో తాత దగ్గరకు వెళ్లాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే కలువ పూడి వైపు వెళ్లే రైలు కాకుండా పొర పాటుగా తిరుపతి వెళ్లే రైలు ఎక్కేసింది. తిరుపతి రైల్వేస్టేషన్లో బిత్తర చూపులు చూసుకుంటూ వెళ్తున్న యువతిని గమనించిన వైజాగ్ ‌కు చెందిన బి.ఉమామహేశ్వరి అనే మహిళ ఆమెతో పరిచయం పెంచుకుంది. వివరాలన్నీ తెలుసుకున్నాక విశాఖలో పని ఇప్పిస్తానని చెప్పి యువతి ని తనతో పాటు తీసుకెళ్లింది.

 

 

 

అతన్ని గుడ్డిగా నమ్మిన యువతి అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్రాధేయపడింది..దాంతో అక్కడి నుండి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు..ఆమెను గాజువాక లోని గంట నాగమణి, బి.గోవింద్‌ల ఇంటికి తీసుకెళ్లి రెండ్రోజులు అక్కడే ఉంచాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీహరిపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడు ఉంచారు. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో పాటు వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించాడు. దానికి ఆ యువతి నిరాకరించింది..అంతేకాకుండా తనని పెళ్ళి చేసుకోవాలని మొండికేసి కూర్చుంది.దాంతో అతను ఇంటికి రావడమే మానేశాడు..అతని జాడ తెలుసుకున్న ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను వివాహం చేసుకోవాలని ఆదేశించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: