సైన్స్ పెరిగింది.. దేశ అభివృద్ధి తో పాటుగా జనాభా కూడా బాగా పెరిగింది. కూర్చున్న చోటుకే అన్నీ వచ్చేలా అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఎటు చూసిన భారత దేశం ఇతర దేశాల తో పోటీ పడుతుంది. ఎంత ఉన్న కూడా మహిళల పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా మహిళలు లైంగిక దాడులను  ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన దారుణం దిశ అత్యాచార ఘటన పూర్తిగా మరవకముందే ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఎందరో మహిళలు మగాళ్ల కామ దాహానికి ప్రాణాలను కోల్పోతున్నారు. 

 

 


సమాజంలోని కామాంధులు వావి వరుసలు పూర్తిగా మరచిపోయి కూర మృగాల్లాగా ఆడవాళ్లపై విరుచుకుపడుతూ కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో దారుణ సంఘటన వెలుగు చూసింది. చెల్లెలిపై కన్నేశాడో కామపిశాచి. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి వికృతానందం పొందాడు. అది చూపించి ఆమెని బెదిరించి ఆరేళ్లుగా నరకం చూపించాడు. గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అయ్యేలా చేసేవాడు. చివరికి ఆ మృగాడి పాపం పండింది.యువతి పై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు చూడడంతో బండారం బయటపడింది.

 

 


ఓ రోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది.దాంతో కుటుంబ సభ్యులు  పరుగున రావడంతో కామాంధుడు అడ్డంగా బుక్కయ్యాడు. అతని పాపం పండడంతో ఇంతకాలం మౌనంగా భరించిన చెల్లెలు ఒక్కసారిగా ప్రతిఘటించింది.జరిగిన విషయాన్నీ పోలీసులకు చెప్పింది. తాను స్నానం చేస్తుండగా వీడియో తీసి.. అది చూపించి బెదిరించి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆరేళ్లుగా నరకం చూపించాడని.. గర్భ నిరోధక మాత్రలతో అబార్షన్ చేయించాడని పేర్కొంది.బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: