మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలను అమలు చేస్తున్న కూడా కామాంధుల చేతిలో రోజుకొకరు బలవుతున్నారు. ఏదోక రకంగా హింసిస్తున్నారు.వారి చేతుల్లో నానా హింసలకు గురి చేయడంతో పాటుగా శారీరకంగా, మానసికంగా నరకాన్ని చూపిస్తున్నారు. విషయానికొస్తే.. బర్త్ డే పార్టీకి పిలిచి ఓ యువతిని మత్తు మందు ఇచ్చి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

 

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మెళియా పుట్టి మండలం చాపర గ్రామంలో జరిగింది. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు లేక పోవడం తో అమ్మమ్మ తో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన గుగ్గిలాపు రామారావు, గుగ్గిలాపు రవి అనే యువకులు ఆమె తో స్నేహంగా మెలుగుతున్నారు. కొద్ది నెలల క్రితం వారిద్దరు పుట్టిన రోజు వేడుకల పేరు తో బాలికను తమ ఇంటికి రప్పించారు.

 

 

 

నమ్మించి కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాలను కలిపి బాలికకు తాగించారు. ఆమె పై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత మత్తు నుంచి కోలుకున్న బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత తాను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న బాధితురాలు అందుకు కారణమైన వారిని నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాని బెదిరించిన నిందితులు ఆమెకు గర్భం పోవడానికి మాత్రలు ఇచ్చారు.

 

 

 

కాసేపటి తర్వాత జననాంగాల వద్ద తీవ్ర రక్త స్రావం కావడంతో బాలిక తన అమ్మమ్మకు విషయం చెప్పింది. దీంతో ఆమె బుధవారం పాత పట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: