లాక్ డౌన్ కాస్త విరమించడంతో ఎవరి దందాలు వాళ్ళు జోరుగా సాగిస్తున్నారు.. పాపులర్ సిటీలో రాత్రిపూట అయితే బడాబాబుల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. వ్యభిచారం ఎక్కడ చూసినా పడగ విప్పింది. కొందరు మసాజ్ ల పేరుతో గుట్టుగా వ్యభిచారం చేస్తుంటే, మరికొందరు అయితే గెస్ట్ హౌస్ లో లేదా పార్టీల పేరుతో విదేశీ అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.. అందుకే ఇప్పుడు పోలీసులు కరోనా భయం నుంచి వ్యభిచారుల గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలో గుట్టుగా సాగుతున్న సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఓ అపార్ట్మెంట్లో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు చేధించారు. నిర్వాహకురాలితో పాటు ఐదుగురు సెక్స్ వర్కర్లు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన మరో విటుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ ఆరు నెలలుగా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు నిర్వాహకురాలు పోలీసుల విచారణలో అంగీకరించింది. సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సెక్స్ రాకెట్ కు జాతీయ, అంతర్జాతీయ సంబంధాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ యువతులను కూడా తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. విటుల కోసం క్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. విశాఖలో సిటీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఓ ఇన్ఫార్మర్ను నియమించి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఓ కానిస్టేబుల్ను సివిల్ డ్రెస్లో లోపలికి పంపించారు. అతడు కస్టమర్లా నటించి అమ్మాయిని బుక్ చేసుకుని గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైడ్ చేశారు. దీంతో అక్కడ గదిలో ఉన్న విదేశీ అమ్మాయిలను విటులను అదుపులోకి తీసుకున్నారు..