నేటి సమాజంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు కొత్త కొత్త నాయకులు వచ్చినా, నేరస్థులకు ఎంత కఠినంగా శిక్షలు వేసినా కానీ, ఆడవారిపై ఆఘాత్యాలు ఆగడం లేదు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. ఇక తాజాగా రైల్వే మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురవడం.. ఆమె శవం బట్టల్లేకుండా నగ్నంగా పడి ఉండడం సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నార్తర్న్ రైల్వేస్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సరోజ్ బాలా(55) ఫరక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్లో ఉంటుంది. ఆమె భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే క్వార్టర్స్లో ఒంటరిగా ఉంటున్న ఆమె హఠాత్తుగా శవమై తేలింది. అంతేకాదు, ఆమె మృతదేహం బట్టల్లేకుండా నగ్నంగా పడి ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
ఉదయాన్నే ఇంటికి వచ్చిన పనిమనిషి నగ్నంగా పడి ఉన్న బాలా మృతదేహాన్ని చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలాను ఎవరో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరియు బాగా మృతదేహం నగ్నంగా పడి ఉండడంతో రేప్ చేసి చంపేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసలు ఆ ఇంట్లో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.