ప్రేమ ఎంత మధురమైనది అని ఒకప్పుడు సినిమాలను చూసి అనుకునేవారు.. కానీ ఇప్పుడు కొంచెం మారింది. ప్రేమిస్తే ఇంత దారుణంగా చంపేస్తారా అనే ఆలోచనలు అందరిలో భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రేమ అనేది చేతి అవసరాలను తీర్చడానికి మాత్రమే మిగిలింది. అసలు విషయానికొస్తే.. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలికి వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అయిందని అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన యూపీలో ఆలస్యంగా వెలుగు చూసింది. 

 

 

సిటీలోని తులసీ నికేతన్ ఏరియా వివేక్ విహార్ కాలనీకి చెందిన ఓ యువతి కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. నాగ్‌పూర్‌కి చెందిన యువకుడితో ఈ నెల చివరిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈలోపే దారుణం జరిగిపోయింది.  అసలు విషయానికొస్తే.. చదువుతున్న మీనా చిన్నప్పుడు ఢిల్లీలోని సుందర్ నగ్రి ప్రాంతంలోని స్కూల్‌లో చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన స్కూల్‌మేట్ ఓ అబ్బాయి చిన్ననాటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అతడిని మృగంలా మార్చింది..ఆ కోపంతో అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించాడు..

 

 


తన ప్రియురాలికి పెళ్లి కుదిరిందన్న విషయం తెలిసిన  ఆగ్రహంతో రగిలిపోయాడు. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులతో కలసి రాత్రి సమయంలో మార్కెట్‌కి వెళ్లిన ఆమె దారికాచి దారుణంగా హత్య చేశాడు. మార్కెట్ నుంచి వస్తూ ఆమె ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద ఆగడంతో తండ్రి  కొంచెం ముందుకెళ్లాడు. తల్లితో కలసి ఆమె ఫుడ్ తీసుకునేందుకు నిల్చుని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ముగురిలో ఒకరు అమ్మాయి తల్లిని కొట్టారు..దాంతో ఆమె అక్కడే సృహ కోల్పోయి పడిపోయింది.

 

 

 

కత్తితో ఆమె మెడ, కడుపులో.. ఇతర అవయవాలపై విచక్షణా రహితంగా పొడిచేశాడు. సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న నన్ను మరో వ్యక్తి అడ్డుకున్నాడు’ అని మృతురాలి తండ్రి చెప్పారు. మార్కెట్‌లో అంతమంది ఉండి కూడా తన కూతురిని కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆయన వాపోయాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: