ప్రేమ అనేది కేవలం ఆడ మగ ల మధ్య ఉన్న ఒక పవిత్ర అనుబంధం.. అలాంటిది ఇప్పుడు చాలా మంది స్వప్రయోజనాల కోసం శారీరక అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే వాడుతున్నారు.ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చే విషయం వెలుగులోకి వచ్చింది.. లెస్బియన్ గా మారిన అక్క చెల్లి వరుస అయ్యే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. అంతేకాదు ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి కూడా చేసుకుంది.. 

 


వివరాల్లోకి వెళితే..ఆమెకు ఆడాళ్లంటే పిచ్చి. అసహజ కోరికలతో రగిలిపోయేది. దూరపు బంధువైన చెల్లెలిపై కన్నేసి మాయమాటలతో లోబరుచుకుంది. ఆమె మాయలో పడిపోయిన మైనర్ బాలిక ఆమెతో కలిసి ఉండేందుకు ఇష్టపడింది. అలా ఇద్దరూ ఒక సంవత్సరం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ లేచిపోయి కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. తిరిగి వస్తారని ఆశించి భంగపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో షాకింగ్ విషయం తెలిసింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని. ఈ ఆశ్యర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.

 

 


అలా ఏడాది పాటు చెల్లెలితో అక్క డేటింగ్ కూడా చేసింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి పారిపోయారు. చెల్లెలిని లేపుకెళ్లిన అక్క గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంది. తాను వరుడిలా వస్త్రధారణ చేసుకుని.. మైనర్ బాలికను వధువులా రెడీ చేసి మరీ తాళికట్టింది. ఆ విషయం తెలియని ఇరుకుటుంబాల సభ్యులు తిరిగి వస్తారులే అని ఎదురుచూశారు. నెల రోజులవుతున్నా ఇద్దరమ్మాయిలు తిరిగిరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

 

 

వాళ్ళు ఇంక రారని ఫిక్స్ అయిన తల్లి దండ్రులు పోలీసులకు మిస్సింగ్ కేసు పెట్టారు..పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు వారి ఆచూకీ కనిపెట్టారు. అయితే అప్పటికే వారికి పెళ్లై పోయిందని తెలియడంతో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు. ఒకే లింగం వారు పెళ్లి చేసుకోవడం భారతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదు కాబట్టి మైనర్ బాలికను లేపుకెళ్లినందుకు అక్కపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: