ప్రతి రోజు ఏదోక వార్త మహిళల పై కామాంధుల లైంగిక దాడులు జరుగుతూ వస్తున్నాయి.. ప్రభుత్వ చట్టాలు ఎన్ని కొత్త గా అమలు లోకి వస్తున్నాయి. అయిన కానీ ఆడ పిల్లలు, మహిళలు మృగాళ్ల పై లైంగిక దాడులు చేస్తున్నారు. మైనర్ బాలిక ను బలవంతం గా ఎత్తు కెళ్లి ఇంట్లో తాళి కట్టి అనంతరం శోభనం పేరుతో లైంగిక దాడి చేసి హింశించాడు.. అమ్మమ్మ అనుమానం తో ఆరా తీయ గా అసలు నిజం బయటకు వచ్చింది..
వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలిక కు బలవంతం గా తాళికట్టి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలం లోని ఓ గ్రామానికి చెందిన బాలిక మామిడి కుదురు మండలం లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమలాపురం లోని ఓ కాలేజీ లో ఇంటర్ చదువుతోంది. రోజూ కాలేజీకి వెళ్లొచ్చే క్రమంలో అప్పన్నపల్లిలో పెట్రోల్ బంకులో పనిచేసే పెదపట్నం గ్రామానికి చెందిన కత్తి మండ మహేష్ బాలిక పై కన్నేశాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు.
గతేడాది డిసెంబర్ 18న బాలిక ను తన ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టేశాడు. అనంతరం శోభనం పేరు తో ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక మానసికం గా కుంగి పోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక అమ్మమ్మ ఈ గత నెల 28వ తేదీన మామిడికుదురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల పిర్యాదు మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించారు..