ఓ యువతి కి కొత్త గా పెళ్లయింది.. భార్య తో కలిసి సంతోషంగా కాలాన్ని సాగిస్తున్నారు. అయితే, తన భార్య కు సోషల్ మీడియా లో ఓ వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అలా భర్తకు తెలియకుండా మొదట ఒకరిని మైంటైన్ చేసింది. సడెన్‌గా ప్రియుడికి బ్రేకప్ చెప్పి కొత్త ప్రియుడి తో రిలేషన్‌షిప్ పెట్టుకుని మరో ఊరు చెక్కేసింది. ఆ విషయం తెలిసి కోపం తో రగిలి పోయిన మాజీ ప్రియుడు ఆమెని దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్‌ లోని జునాగఢ్‌ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.. 

 

 

అమ్రేలీలోని బగస్రా ప్రాంతానికి చెందిన భావనకి లతీ పట్టణానికి చెందిన వ్యక్తితో 2012లో వివాహమైంది. మెట్టినింటికి వచ్చిన భావనకి అదే ప్రాంతానికి చెందిన సంజయ్ ప్రవీణ్‌తో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి సహజీవనం చేశారు. రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. సడెన్‌గా ఆమె ప్రియుడు సంజయ్‌కి బ్రేకప్ చెప్పింది.సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. మరొకరితో సహజీవనం చేస్తోందని తెలిసి సంజయ్ కోపంతో రగిలిపోయాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. జునాగఢ్‌ చేరుకుని ఆమె కదలికలపై నిఘా పెట్టాడు.

 

 

అలా అప్పటి నుంచి ఆమెను కంటికి రెప్పలా కదలికలను చూస్తూ వస్తున్నాడు. అలా ఓ రోజు కూరగాయలు తెచ్చుకునేందుకు మార్కెట్‌కి వెళ్తున్న మాజీ ప్రియురాలు భావనని వెంబడించాడు. అదను చూసి మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె బతకకూడదన్న కసితో పదిసార్లు పొడిచి పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె శవం పక్కనే కూర్చున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: