నేడు వయసు బేధం లేకుండా వారు వీరు అన్నది లేకుండా... కనీసం మానవత్వాన్ని మరిచి ఎంతకైనా తెగిస్తున్నారు ఈ నరరూప రాక్షసులు. ఒకటా రెండా ఇలాంటి దారుణాలు ఎన్ని జరిగినా ఈ దారుణాలకి హద్దూ అదుపూ లేకుండా పోతోంది అలాంటి ఘటన ఇప్పుడు మరో సారి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు గ్రామ వాలంటీర్

 

తాజాగా ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఒక మైనర్ బాలిక  పై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే...   చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరు పల్లి లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది . అయితే ఒక మైనర్ బాలిక పై గ్రామ వాలెంటీర్  నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు . చదువుకుంటున్న చిన్నారిని అన్యాయంగా అత్యాచారం చేసాడు ఈ పశువు . బాలిక కేవలం తొమ్మిదో తరగతి చదువుతోంది . ఆ విద్యార్థిని స్నానం చేసి ఇంటికి వెళ్తుండగా ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ పశువు . ఏమి తెలియని విద్యార్థిని ఆ కామాంధుడి చేతుల్లో బలై పోయింది. ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసాడు ఈ పశువు.

 

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల దాకా పోలీసులకి కంప్లైంట్ రాలేదు. రెండు రోజుల తర్వాత బాధిత బాలిక తల్లిదండ్రులు శుక్రవారం నాడు పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది . అయితే కేసు లేకుండా చూసేందుకు స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించినట్టు కూడా తెలియ జేసారు. కానీ పంచాయతీ విఫలం కావడం తో ఆ బాలిక తల్లి దండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆ గ్రామ వాలంటీర్ పైన కేసు నమోదు చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: