ఒకవైపు కరోనా ప్రభావం పెరుగుతున్న మరో వైపు కామాంధుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి.. ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్న కూడా కామాంధుల దాడులు తగ్గలేదు.. మహిళల హత్యలు తగ్గలేదు.నిత్యం ఎక్కడో చోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావం తో ఎక్కడ చూసినా లాక్ డౌన్ ఉన్నా కూడా దుర్మార్గుల వికృత చేష్టలు మాత్రం తగ్గలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఓ మహిళని గ్యాంగ్ రేప్ చేయాలని చూసిన గ్యాంగ్.. ఆమె ప్రతి ఘటించడంతో తీవ్రంగా కొట్టి చంపేసిన అమానుష ఘటన వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన యూపీ లోని ఏతాహ్‌లో చోటు చేసుకుంది.

 

 

అసలు విషయానికొస్తే.. ఏతాహ్‌కి చెందిన మహిళ కుటుంబం తో కలసి ఢిల్లీలో నివాసం ఉండేది. కరోనా మహమ్మారి కారణంగా ఏతాహ్‌కి తిరిగి వచ్చేసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భర్త, ముగ్గురు పిల్లలు, వంట మనిషితో కలసి ఇంట్లో నివాసముంటోంది. గతం లో ఆమె అద్దెకు ఉన్న ఇంటి యజమానులు బదన్ సింగ్, సునీల్ సహా మరో నలుగురు దుర్మార్గులు దినేష్ యాదవ్, హేమంత్, త్రివేందర్, అనిల్ యాదవ్ ఆమె పై కన్నేశారు.

 

 

ఆమె తో ఎలాగైనా వారి కామ కోరికలు తీర్చు కోవాలని అనుకున్నారు. ఆమెను అనుభవించాలని దుర్మార్గానికి ఒడిగట్టారు. కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశారు. ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసేందుకు యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం తో దారుణంగా చంపేసి సమీపంలోని చెరువు వద్ద పడేశారు. బండ రాళ్లతో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశారు. రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. అందులో నలుగురి పై పలు క్రిమినల్ కేసులున్నాయి.ఆమె అందించిన వివరాల ప్రకారం కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు .

మరింత సమాచారం తెలుసుకోండి: