ప్రేమ పేరు తో అమ్మాయిల ను నమ్మించి బుట్ట లో వేసుకుని మాయ మాటలు చెప్పి అవసరాలు తీరాక మొహం చాటేస్తున్నారు. అలాంటి సంఘటనలు ఇటీవల చాలా జరిగాయి. ప్రేమిస్తున్నాను నీకోసం ప్రాణాలను ఇస్తాను అని దొంగ మాటలు చెప్పి షికార్లకు , సినిమాలకు , పార్టీలకు తిప్పి సహజీవనం చేద్దామని ఆమెకు లేని పోని ఆశలు కల్పించి కోరికలు తీరాక అడ్రెస్స్ లేకుండా ఉడాయిస్తున్నారు..అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. 

 

 


వివరాల్లోకి వెళితే.. శారీరకంగా దగ్గరై కోరికలు తీర్చుకుంటూ వచ్చాడు. కొద్ది రోజులు అయ్యాక నీ పై మోజు తీరిపోయిందంటూ మొహం చాటేశాడు. దీంతో మోస పోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సత్తెనపల్లి గ్రామీణ మండలంలోని పెదమక్కెన గ్రామానికి చెందిన ఓ యువతి శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. తన ఇంటి ఎదురుగా ఉండే యువకుడు తనను ప్రేమ పేరుతో లొంగ దీసుకున్నాడని, కొంత కాలంగా తన తో శారీరక కోరికలు తీర్చుకుంటూ పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడని బాధితురాలు చెబుతోంది. 

 

 

తనకు న్యాయం చేసేవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతోంది. తన ప్రియుడిని తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి తరలించి నాటకమాడుతున్నారని ఆరోపిస్తోంది.ఈ విషయం పై తాజాగా స్పందించిన యువకుడి తల్లి మాట్లాడింది. తమ కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, ఆదివారం అతడిని ఇంటికి పిలిపించి చర్చిస్తామని చెబుతోంది. యువతి దీక్ష విరమిస్తేనే చర్చలకు అవకాశముంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సత్తెనపల్లి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇలాంటి ప్రేమలను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: