ఓ అక్రమ సంబంధం అతని జీవితం పూర్తిగా మారిపోయింది.ప్రియురాలితో అక్రమ సంబంధం కోసం భార్యను వదిలేసి గత కొంతకాలంగా ప్రియురాలితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.. భార్య సాదింపులు తట్టుకోలేని అతను ప్రియురాలికి పుట్టిన బిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. నవరంగ్‌పూర్‌ జిల్లా ఝరిగాం సమితి చక్కోపొదర్‌ పంచాయతీ గాయిటొరా గ్రామానికి చెందిన వాసుదేవ్‌ జానికి గతంలో ఓ మహిళతో వివాహ జరిగింది. కొన్నాళ్లకు మరో మహిళతో ప్రేమలో పడిన అతడు భార్య వదిలేశాడు. పక్క గ్రామమైన బఘడొగరిలో ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

 

 


ప్రియురాలి పై మోజులో పడి ఇంటికి రాకుండా తనని పట్టించుకోవడం లేదని భర్త పై కోపంతో రగిలి పోయింది. భార్య .. దాంతో పలుమార్లు భర్తతో గొడవ పెట్టుకుంది. అనేక సార్లు అతనిపై కుటుంబ సభ్యుల తో కలిసి వాగ్వాదానికి దిగాడు.అతనిపై కోపంతో ప్రియురాలితో కూడా గొడవకు దిగింది. తన భర్త వల్ల ప్రియురాలికి కొడుకు పుట్టాడని తెలుసుకున్న భార్య ఇంక ఆస్తి మొత్తాన్ని తనకే రాసిస్తాడని ఆలోచించిన ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగింది. 

 

 


ఈ విషయం తెలుసుకున్న భార్య వారింటికి వచ్చి గొడవ పెట్టుకుంది. దీంతో విసుగు చెందిన వాసుదేవ్‌జాని ప్రియురాలికి పుట్టిన బిడ్డను బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసి నదిలో పడేశాడు. బిడ్డతో వెళ్లిన ప్రియుడు ఒంటరిగా రావడంతో అనుమానమొచ్చిన మహిళ నిలదీయగా చంపేసిన నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు వాసుదేవ్‌జానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.భార్య మాటలు తట్టుకోలేక ప్రియురాలికి పుట్టిన బిడ్డను చంపడం అమానుషం అని అందరూ అంటున్నారు. పసికందును చంపేయడం పై ప్రియురాలి దిగ్భ్రాంతికి గురైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: