కరోనా తర్వాత వినపడుతున్న పేరు వ్యభిచారం.. ఈ వ్యభిచారం వల్ల ఎన్నో సంసారాలు గుల్లవుతున్నాయి.. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి ఈ ఉచ్చులోకి దించుతున్నారు.. అలా వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ సొమ్ము పోగేసుకుంటున్నారు..అంతేకాదు వ్యాపారం చేస్తున్న కూడా డబ్బులు ఇవ్వలేదని చాలా మంది మహిళలు ఎదురు తిరిగారు..అలా ఎదురు తిరుగుతున్న వారిని బలముతో, బలగంతో అనిచివేస్తున్నారు.. 

 

 

అలా కాదని ఎదురు తిరిగితే చావును కూడా రుచి చూపిస్తున్నారు.. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన వైజాగ్ దివ్య హత్య కేసు..వెలుగు లోకి వచ్చింది కేవలం దివ్య హత్య మాత్రమే.. వెలుగులోకి రాని చాలా కేసులు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు..ఇకపోతే అసలు విషయానికొస్తే.. పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారు.. ఇలా వ్యభిచార ముఠాలు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యభిచారం అనేది ఇళ్ల మధ్యలోనే నడిపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 

 

 


అయితే హైదరాబాద్ లాంటి మహా నగరంలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో కూడా వ్యభిచారం జోరుగా సాగుతోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ముందుకొస్తో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా వారు మళ్లీ బయటకు వచ్చి అదే పనిగా వ్యభిచార గృహాలకు నడిపిస్తున్నారు..ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఇలాంటి పాడు పనులు చేసేది పేరు మోసిన బడాబాబులు.. కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా పెరుగుతూ వస్తున్న కూడా వ్యభిచార దందాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి..ఈ వ్యభిచారాన్ని పూర్తిగా రూపు మాపడానికి పోలీసులు వారిలో వారే ఛాలెంజ్ ను విసిరారు.. రాష్ట్రంలో ఉన్న వ్యభిచార స్థావరాలను గుర్తించి నిర్వాకులకు కఠిన శిక్షలు అమలు చేయాలని నిర్ణయించారు.. మరి పోలీసుల ఛాలెంజ్ ఎంతవరకు నెరవేరుతుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: