ఏంటో.. కొన్ని జీవితాలు అస్సలు అర్థం కావు. బంగారం లాంటి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటారు. చివరకు ఎందుకిలా చేశామని బాధపడతారు. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ పరిస్థితి కూడా అదే. ఒక్క మిస్డ్ కాల్తో పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్తను.. ఇద్దరు పిల్లలను వదిలేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. చివరకు ఎటూకాకుండా పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని నెల్లై జిల్లా సేరన్ మహాదేవిలో చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయిన ఓ మహిళ చిన్నవయస్సు నుండి బంధువులు వద్ద పెరిగింది.
ఆమెకు పెళ్లి వయస్సు వచ్చాక మహాదేవికి చెందిన ఒక కూలీ కార్మికుడు మానవత్వంతో కట్నం, బంగారం తీసుకోకుండానే పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే ఒక్కటిన్నర సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓ మిస్డ్ కాల్ వారి కాపురంలో చిచ్చురేపింది. మిస్డ్ కాల్ తో పరిచయం అయిన యువకుడితో తాను మిస్ అని మిసెస్ కాదని నమ్మించి ముగ్గులోకి దింపింది. అది నమ్మిన సదరు యువకుడు ఈమెతో పరిచయం పెంచుకున్నారు. చివరకు అది ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే గత 20వ తేదీ నాగర్కోవిల్లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి.. బయటకు వెళ్లిన ఆమె ప్రియుడిని రెండో వివాహం చేసికుంది. అంతటితో ఆమె సైలెంట్ గా ఉండలేదు. భర్త రెండో పెళ్లి ఫోటోలను ఆమె ఫోన్ లో స్టేటస్ పెట్టింది. అదే సమయంలో విషయం తెలియని భర్త.. భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. ఆమె స్టేటస్లో ఫోటోలు కంటబట్టాయి. అప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుందన్న విషయం బయటపడింది.
దీంతో పోలీసులు ఆమెను, ఆమె పెళ్లి చేసుకున్న యువకుడిని విచారణకు పిలిచారు. అక్కడ సదరు యువకుడు.. ఆమెకి ముందే వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో కాపురం చేయడానికి నిరాకరించారు. అలాగే మరోవైపు మొదటి భర్త, బంధువులు కూడా ఆమెను కుటుంబంలోకి అనుమతించమని తేల్చిచెప్పారు. ఇక మొదటి భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త ఛీకొట్టడంతో.. చేసేదేమి లేక పోలీసులు ఆమెను సేరన్ మహాదేవి శిబిరానికి పంపారు.