కృష్ణా జిల్లాలో ఓ వైసీపీ నేత అక్కా చెల్లెళ్లతో సీక్రెట్గా రాసలీలల వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఓ కానిస్టేబుల్ తన భార్యతో సదరు వైసీపీ నేత రాసలీలలు కొనసాగిస్తున్నాడన్న సందేహంతో మాటు వేసి ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సదరు వైసీపీ నేత ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని ఉండగా ఆ ఇంటిపై కన్నేశాడు. బుధవారం ఆ ఇంట్లోకి ఓ మహిళతో వెళ్లిన వైసీపీ నేతను పట్టించాలన్న ఉద్దేశంతో సదరు కానిస్టేబుల్ బయట గడి పెట్టి పోలీసులను, మీడియాను తీసుకు వచ్చాడు.
బయట మీడియా, పోలీసులు ఉండగా డోరు కొట్టడంతో లోపలకు వెళ్లిన సదరు కానిస్టేబుల్కు దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది. లోపల సదరు వైసీపీ నేతతో రాసలీలలు కొనసాగిస్తున్నది సదరు కానిస్టేబుల్ భార్య కాదు.. స్వయానా వదిన. దీంతో కానిస్టేబుల్కు అప్పుడు అర్థమైంది. సదరు వైసీపీ నేత అక్కాచెల్లిళ్లు ఇద్దరిని బుట్టలో వేసుకున్నాడన్నది ఆ నిర్వాకం చూస్తున్న వారికి క్లారిటీ వచ్చింది. చివరకు అవాక్కైన కానిస్టేబుల్ ఇది తప్పని ఆ వదినను ప్రశ్నించగా ఆ వదిన కూడా నీకెందుకు అంటూ ఆ కానిస్టేబుల్పై ఫైర్ అయ్యింది.
చివరకు అక్కడ పెద్ద గొడవ జరగగా... ఈ గొడవలోనే వదిన - వైసీపీ నేత కారులో పరారయ్యారు. తర్వాత ఆ కానిస్టేబుల్ మీడియాతో మాట్లాడుతూ సదరు వైసీపీ నేత తన కాపురంతో పాటు తన తోడళ్లుడు కాపురం కూడా కూల్చేస్తున్నాడని... మా తోడళ్లుడు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతంలో ఉండడంతో మా వదినతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడని వాపోయాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఖరారు కావడంతో చివరకు అతడిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని సమాచారం.