నేరాల విషయంలో ప్రజల్లో అప్రమత్తత ఉన్నా పోలీసులు అప్రమత్తంగా ఉన్నా సరే జరిగేవి జరుగుతూనే ఉంటాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు నేరాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. ప్రజల్లో కూడా నేరాలకు దూరంగా ఉండాలి అనే అవగాహన కల్పిస్తున్నాయి. అయినా సరే కొందరు మాత్రం మారడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక ఘోరం జరిగింది. బరేలి జిల్లాలో కన్న కూతురు మీద అత్యాచారం చేసాడు ఒక మృగం. తల్లి చనిపోయి ఆమె తండ్రి వద్ద ఉంటుంది. ఇంటర్ చదివింది.

స్థానికంగా పని చేసుకుంటూ ఆమె తండ్రికి అన్నీ తానై వ్యవహరిస్తుంది. కొన్నాళ్ళు స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలని ఆమె భావిస్తుంది. కాని ఆమె జీవితాన్ని కొన్ని ఘటనలు మలుపు తిప్పాయి.  ఒక రోజు ఆమె నిద్రపోతున్న సమయంలో తండ్రి తలుపులు వేసి ఆమె మూతికి గుడ్డ కట్టి ఆమెను అత్యాచారం చేసాడు. ఈ విషయం ఎవరికి అయిన చెప్తే చంపేస్తా అని చెప్పాడు. అయితే ఆమె అప్పటికే ఒక యువకుడిని ప్రేమిస్తుంది. అత్యాచారం అయిన తర్వాత తండ్రి కావడంతో పరువు కోసం అయినా ఆమె భరించింది.

కాని కొన్ని నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తన బాయ్ ఫ్రెండ్ కి తెలిసింది. అతను నీకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి అని నిలదీశాడు. గత ఆరు నెలలుగా నేను నిన్ను కరోనా కారణంగా కలవలేదు. మన మధ్య శారీరక సంబంధం జరిగింది ఏడాది పైగా అవుతుంది నీకు గర్భం ఎలా వచ్చింది అని నిలదీశాడు. తన జీవితంలో ఎదురైన ఆ కాళ రాత్రి గురించి చెప్పింది. వెంటనే వెళ్లి ఆమె తండ్రిని దారుణంగా చంపేసి పోలీసులకు లొంగిపోయాడు. అతని మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: