ఈ మధ్య కాలంలో కుటుంబ వివాదాల కారణంగా ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం కుటుంబ కలహాలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఉద్యోగాలు చేసే వారిలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సరే ప్రజల తీరులో మార్పు రావడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పెట్టుకుని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్డింగ్ ఐదవ అంతస్తు పై నుండి దూకి వివాహిత శ్రీ విద్య (27) ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల క్రితం వరంగల్ కు చెందిన శబరిష్ తో కరీంనగర్ కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. భర్త శబరిష్ పని నిమిత్తం  బెంగళూర్ కు వెళ్లడంతో చందానగర్ లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య... అక్కడే ఉంటుంది. నిన్న మధ్యాహ్నం భర్త శబరిష్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఘర్షణ పడి భవనం పై నుండి ఆమె దూకింది.

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గాయాల పాలైన శ్రీవిద్య ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు  తరలించారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది అని పోలీసులు మీడియాకు వివరించారు. భర్త శబరిష్ వేదిపులే శ్రీవిద్య ఆత్మహత్యకు కు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు. వారి స్నేహితులను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: