నేరాల విషయంలో  ఇప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట నేరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. పోలీసులు కూడా ఫోకస్ పెట్టినా సరే ఇప్పుడు నేరాలు ఆగడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన చాలా సంచలనం అయింది. ఒక అమ్మాయి తన క్లాస్ మేట్ ని ప్రేమించింది. ఆమె అతనికి రెండేళ్ళు గా పరిచయం. ఇద్దరు చదివేది ఇంటర్ మొదటి ఏడాది. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉంది అనే విషయం అబ్బాయి దృష్టికి వచ్చింది.

దాదాపు ఆమెకు మూడు నెలలుగా వార్నింగ్ ఇస్తూ  వచ్చాడు. అయినా సరే  ఆమె మాత్రం అతనితో మాట్లాడకుండా ఎక్కడా కూడా ఆగలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళ దృష్టికి కూడా వెళ్లి అసలు విషయం బయట పడింది. అయితే కొన్ని రోజులకు ఆమెకు గర్భం  వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా ఆమెకు గర్భం తీయించే ప్రయత్నం చేసారు. కాని ఆమెకు గర్భం తీస్తే ప్రాణాలకే ప్రమాదం అని  వైద్యులు చెప్పడంతో అలాగే ఉంచాలి అని వారికి ఇద్దరికీ పెళ్లి చేయాలని తల్లి తండ్రులు భావించారు. ప్రేమించింది ఎవరు అనే విషయం తల్లి తండ్రులు ఆరా తీసారు.

 ఒకడిని ప్రేమిస్తూ మరొకరితో ఆమె చనువుగా ఉంటూ అతనితో గర్భం దాల్చింది. ఆమెకు గర్భం వచ్చింది అనే విషయం ఆమె మొదటి ప్రియుడుకి తెలిసింది. హాస్పిటల్ లో ఉండే ఒక నర్సు అతనికి చెప్పింది. ఇంటికి వెళ్లి ఆమెను చంపడమే కాదు... ఆ అబ్బాయిని కూడా చంపేసాడు. ఈ ఏడాది మార్చ్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెల్లడి అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: