నవీన్ దూరం అవుతాడానే కారణంగా నవంబర్ 30 న అనిత కూతురు వందనను ఇచ్చి పెళ్లి చేసింది అనిత. పెళ్లి తరువాత కూడా అత్త అనిత తో అక్రమ సంబంధం కొనసాగించాడు నవీన్. ఈ విషయం తెలుసుకొని తల్లి అనిత ను కూతురు వందన నిలదీసింది. తన తల్లితో భర్త అక్రమ సబంధం జీర్ణించుకోలేక మార్చ్ నెలలో ఆత్మహత్య చేసుకుంది వందన. ఈ కేసులో తల్లి అనిత , భర్త నవీన్ ను పోలీసులు జైలుకి పంపించారు.
ఈ ఏడాది మే నెలలో బెయిల్ బయటికి వచ్చిన అనిత, నవీన్... ఈ నెల 11 తేదీన రామాంత పూర్ లో ఓ ఇల్లు ను అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. కేసు విషయంలో నవీన్ నుండి అనిత కు వేధింపులు ఎక్కువ కావడం తో చంపాలని ప్లాన్ చేసింది. రాత్రి నవీన్ పై విచక్షణ రహితంగా కత్తి తో దాడి చేసి చంపింది. నవీన్ శరీరం లో 16 కత్తి పోట్లు ఉన్నట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. నిందితురాల అనిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు... ఆమెను రిమాండ్ కి తరలించారు. నవీన్ మృత దేహాన్ని ఉస్మానియా కి తరలించారు.