రామంత పూర్ లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం  వెలుగులోకి వచ్చింది. నవీన్ అనే వ్యక్తిని కత్తి తో దాడి చేసి చంపిన అత్త అనిత స్టోరీలో ఆసక్తికర మలుపులు ఉన్నాయి. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నవీన్ ను హత్య చేసిన అనిత ను ఘటన స్థలానికి తీసుకొచ్చి విచారణ చేసిన పోలీసులకు షాక్ అయ్యే నిజాలు తెలిసాయి. అనిత కు నవీన్ కు గత కొన్ని ఏళ్లుగా అక్రమ సంబంధం  ఉందని గుర్తించారు.

నవీన్ దూరం అవుతాడానే కారణంగా నవంబర్ 30 న అనిత కూతురు వందనను ఇచ్చి పెళ్లి  చేసింది అనిత. పెళ్లి తరువాత కూడా అత్త అనిత తో అక్రమ సంబంధం కొనసాగించాడు నవీన్. ఈ విషయం తెలుసుకొని తల్లి అనిత ను కూతురు వందన  నిలదీసింది. తన తల్లితో భర్త అక్రమ సబంధం జీర్ణించుకోలేక మార్చ్ నెలలో ఆత్మహత్య చేసుకుంది వందన. ఈ కేసులో తల్లి అనిత , భర్త నవీన్ ను పోలీసులు జైలుకి పంపించారు.

ఈ ఏడాది మే నెలలో బెయిల్ బయటికి వచ్చిన అనిత, నవీన్... ఈ నెల 11 తేదీన రామాంత పూర్ లో ఓ ఇల్లు ను అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసి నివాసం ఉంటున్నారు. కేసు విషయంలో నవీన్ నుండి అనిత కు వేధింపులు ఎక్కువ కావడం తో చంపాలని ప్లాన్ చేసింది. రాత్రి నవీన్ పై విచక్షణ రహితంగా కత్తి తో దాడి చేసి చంపింది. నవీన్ శరీరం లో  16 కత్తి పోట్లు ఉన్నట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. నిందితురాల అనిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు... ఆమెను రిమాండ్ కి తరలించారు. నవీన్ మృత దేహాన్ని ఉస్మానియా కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: