తాజాగా మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు ఘటనలు సంచలనం అయ్యాయి. ఈ రెండు ఘటనలు గత వారం సంచలనం అయ్యాయి. మధ్యప్రదేశ్ లో ఒక 70 ఏళ్ళ వృద్దురాలు తన పొలానికి నీళ్ళు పెట్టాలి అని వెళ్తే ఒక యువకుడు ఆమె మీద అత్యాచారం చేసాడు. నోట్లో మట్టి కుక్కి ఆమెను రేప్ చేసాడు. ఆమె జననాంగాల్లో కర్ర చొప్పించాడు. ఈ ఘటన సంచలనం అయింది. పోలీసులు ఇప్పటి వరకు నిందితుడుని గుర్తించలేదు. ఇక ఉత్తరప్రదేశ్ లో ఒక బాలిక విషయంలో కొందరు క్రూరంగా ప్రవర్తించారు.
ఆడ పిల్ల పుట్టాలి అంటే ఒక చిన్న పాపని రేప్ చేసి చంపాలి అని ఒక మాంత్రికుడు చెప్పాడు. దీనితో దీపావళి బాంబులు కొనడానికి వెళ్ళిన బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపారు. ఆ బాలిక ఊపిరితిత్తులు కూడా బయటకు తీసారు. ఈ ఘటన సంచలనం అయింది. ఈ రెండు ఘటనలు కూడా ప్రజల్లో ఒకరకమైన భయాన్ని సృష్టించాయి అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. ఒక ఘటనలో మాత్రమే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.