రుస్తుం పెద్ద కుమారుడు శేఖర్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దారుణ కుట్రకు పథక రచన చేశాడు. తన తండ్రి చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తాయని భావించాడు. ఈ క్రమంలో కన్నతండ్రినే కడతేర్చాలనుకున్నాడు. ఆదివారం (నవంబర్ 22) మధ్యాహ్నం రుస్తుం కుటుంబసభ్యులందరూ పొలం వద్ద విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. తాగిన మత్తులో రుస్తుం ఆ రాత్రి పొలం వద్దే నిద్రించాడు. ఇదే అదనుగా భావించిన శేఖర్ నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కపట నాటకానికి తెరతీశాడు. అంతవరకు సరాదాగా గడిపిన రుస్తుం తెల్లారేసరికి విగతజీవిగా మారడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. శేఖర్ ప్రవర్తనా తీరులో అనుమానం రావడంతో అతడిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో రుస్తుంను తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడిని పట్టించారు. బాధితుడి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శేఖర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రుస్తుం పెద్ద కుమారుడు శేఖర్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దారుణ కుట్రకు పథక రచన చేశాడు. తన తండ్రి చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తాయని భావించాడు. ఈ క్రమంలో కన్నతండ్రినే కడతేర్చాలనుకున్నాడు. ఆదివారం (నవంబర్ 22) మధ్యాహ్నం రుస్తుం కుటుంబసభ్యులందరూ పొలం వద్ద విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. తాగిన మత్తులో రుస్తుం ఆ రాత్రి పొలం వద్దే నిద్రించాడు. ఇదే అదనుగా భావించిన శేఖర్ నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కపట నాటకానికి తెరతీశాడు. అంతవరకు సరాదాగా గడిపిన రుస్తుం తెల్లారేసరికి విగతజీవిగా మారడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. శేఖర్ ప్రవర్తనా తీరులో అనుమానం రావడంతో అతడిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో రుస్తుంను తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడిని పట్టించారు. బాధితుడి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శేఖర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.