సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న ఓ మహిళకు గాలం వేయగా పెళ్లి ముహుర్తాలు కుదుర్చుకునే స్థాయికి రావటంతో తెలిసిన వాళ్ళ ద్వారా అతనికి వివాహ బాగోతం బట్ట బయలు అయ్యిందన్నారు. ఇలాంటి వాడిని పోలీసులు కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేసారు. రిచ్ మహిళలు టార్గెట్ గా చేసుకుని ఫారిన్ లో సెటిల్ కావాలనేది విజయభాస్కర్ టార్గెట్ అని ఆమె చెప్పారు. నాలాంటి పేద, మద్య తరగతి మహిళలు మరెవ్వరు మోసపోకూడదనే నా పోరాటం అన్నారు. వివాహాలు సెట్ చేసుకునేందుకు డమ్మీ మమ్మీ అద్దే డాడీలతో నిత్యపెళ్లి కొడుకుగా మారాడు అన్నారు.
ప్రస్తుతం అతని భాగోతం బట్టబయలు కావడంతో పరారీలో ఉన్నాడు అని, అతని వల్ల నా కుటుంబం విదాలుగా రోడ్డున పడింది అని ఆమె పేర్కొన్నారు. నా పరిస్థితి చూసి తట్టుకోలేక నా తండ్రి మానసిక వేదనకు గురయ్యారు అని ఆమె చెప్పారు. ఒంగోలు దిశ, హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం అన్నారు. విచారించి కేసు నమోదు చేస్తామని దిశ పోలీసులు తెలిపారు అని ఆమె మీడియాకు వివరించారు.