దాంతో ఆ సదరు యువతి అతన్ని పెళ్లి చేసుకోమ్మని అడిగింది. దాంతో ఆ యువకుడు అతిదారుణంగా తన ప్రేమను సైతం మర్చిపోయి తన ప్రేయసిని హత్య చేశారు. అచ్చం సినిమాలోలాగే ఈ దారుణం బయట ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోని గోడలో శవాన్ని దాచాడు. అదే ఇంట్లో ఆ యువకుడు గత మూడు నెలలుగా నివసిస్తున్నాడు.. పూర్తి వివరాళ్లోకి వెళితే.. పాల్ గఢ్ జిల్లాలోని వనగామ్ లో నిందితుడు ఓ మహిళను ప్రేమించాడు. ఆమెతో 5 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కాగా ఈ మహిళ మూడు నెలలుగా కనిపించడం లేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిందితుడిని.. మా అమ్మాయి ఎక్కడా అని అడిగారు.. దానికి నిందితుడు పనిమీద గుజరాత్ లోని వాపికి వెళ్లింది.. తొందరలోనే తిరిగి వస్తుందని అబద్దం చెప్పాడు. కానీ ఆమె రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు చెప్పిన సమాధానాలు ఏ ఒక్కటి కూడా పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు ఆరా తీశారు. దాంతో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినందుకే ఆమెను హత్య చేసి గోడలో దాచి పెట్టినట్టు నిందితుడు పోలీసులకు వెళ్లడించాడు. దాంతో పోలీసులు ఆ గోడను తొవ్వి ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీసారు. కానీ అప్పటికే ఆ మృతదేహం పూర్తిగా అస్థిపంజరంలా మారిందని పోలీసులు తెలిపారు. కాగా ఆమెను అక్టోబర్ 21 రోజునే చివరి సారిగా కనిపించిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడిపై పలు సెక్షన్లు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.